కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా స్నాతకోత్సవ( గ్రాడ్యుయేషన్ డే )వేడుక
కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా స్నాతకోత్సవ( గ్రాడ్యుయేషన్ డే )వేడుక
Harish K
గ్రామీణ స్థాయి నుంచి ఇంజనీరింగ్ లో పట్టబద్రులు కావడం ఎంతో గర్వకారణం
గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందించేందుకే కళాశాలను స్థాపించాం
కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ
కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్నాతకోత్సవ వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ పాల్గొని, పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ..మానవ విలువలతో కూడిన విద్యను, అత్యాధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని,భవిష్యత్తును రూపొందించే ఆవిష్కరణలను చేపట్టాలని పట్టభద్రులకు సూచించారు. అలాగే గ్రామీణ స్థాయి నుంచి ఇంజనీరింగ్ లో పట్టబద్రులు కావడం ఎంతో గర్వకారణమని,ఇదే స్ఫూర్తితో ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని పట్టభద్రులకు సూచించారు.అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను విద్యార్థినులకు అందించాలని ఉద్దేశంతో కళాశాలను స్థాపించినట్లు చైర్మన్ వివరించడం జరిగింది.అలాగే పట్టభద్రులకు స్నాతకోత్సవ పట్టాలను కళాశాల చైర్మన్ అందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ,
అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు,వివిధ విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, శివాజీ, లక్ష్మణ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు,తల్లితండ్రులు పాల్గొన్నారు.విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి