Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:29 AM

కేవైసీ రద్దు చేయాలి… 200 రోజులు పని, రూ.800 కూలీ ఇవ్వాలని వినతి.

కేవైసీ రద్దు చేయాలి… 200 రోజులు పని, రూ.800 కూలీ ఇవ్వాలని వినతి.

కేవైసీ రద్దు చేయాలి… 200 రోజులు పని, రూ.800 కూలీ ఇవ్వాలని వినతి.
April 30, 2026 03:47 PM 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజపేట,

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఇబ్బందులు కలిగిస్తున్న కేవైసీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి, రోజుకు రూ.800 కూలీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

గురువారం రాజపేట మండల ఎంపీడీవో కార్యాలయం ముందు ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘం ఆధ్వర్యంలో సదస్సు అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌కు డిమాండ్లతో కూడిన మెమొరాండం అందజేశారు.

ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపర్చే విధంగా కొత్త నిబంధనలు తీసుకువస్తోందని విమర్శించారు. ముఖ ఆధారిత కేవైసీ విధానం కారణంగా కూలీలు పనికి దూరమవుతున్నారని అన్నారు. ఇప్పటికే చేసిన పనులకు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, మెడికల్ సదుపాయాలు కల్పించాలని, ప్రమాదాల సమయంలో పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతన బకాయిలను వెంటనే విడుదల చేసి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని పేదలకు ఇస్తానన్న రూ.12 వేల సహాయాన్ని తక్షణం అమలు చేయాలని నర్సింహ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌల్, జిల్లా కమిటీ సభ్యుడు కటికల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News