PRINT TIME: April 29, 2026 07:09 PM
క్రిష్ణవేణి విద్యార్థుల ప్రభంజనం. ఎస్ఎస్సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత
క్రిష్ణవేణి విద్యార్థుల ప్రభంజనం. ఎస్ఎస్సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత
April 29, 2026 05:39 PM
11 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట:
ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పరీక్షలకు హాజరైన 34 మంది విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు.
టాపర్స్:
అప్పం సహస్ర – 567/600 (ప్రథమ స్థానం)
రింషా సదాఫ్ – 565/600 (ద్వితీయ స్థానం)
ఎస్. ప్రణతి – 560/600 (తృతీయ స్థానం)
మొత్తం 35 మంది విద్యార్థుల్లో 21 మంది 500కి పైగా మార్కులు సాధించడం విశేషమని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, డైరెక్టర్ జె. మణి, ఉపాధ్యాయులు రషీద్, మురళి, శ్రీనివాస్, మల్లేష్, అలీమ్, సత్తయ్య తదితరులు విద్యార్థులను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి