కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత
కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత
Editor Desk
కార్మికులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత అన్నారు. మే డే సందర్భంగా రామన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి సబిత మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ నివారణకు రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్నాయని తెలిపారు. అవగాహన లోపంతో ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా, ఆరోగ్య, ఆర్థిక పథకాలపై కూడా కార్మికులకు వివరించారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలపై వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు యాదాసు యాదయ్య, కునూరు శ్రీనివాస్, మార్కెట్ సూపర్వైజర్ ఎం.రమేష్, డైరెక్టర్ జి.నాగేందర్ తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి