Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:17 AM

కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత

కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత

కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత
01-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కార్మికులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత అన్నారు. మే డే సందర్భంగా రామన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్జి సబిత మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ నివారణకు రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్నాయని తెలిపారు. అవగాహన లోపంతో ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా, ఆరోగ్య, ఆర్థిక పథకాలపై కూడా కార్మికులకు వివరించారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలపై వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు యాదాసు యాదయ్య, కునూరు శ్రీనివాస్, మార్కెట్ సూపర్వైజర్ ఎం.రమేష్, డైరెక్టర్ జి.నాగేందర్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత

Article Image

కార్మికులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత అన్నారు. మే డే సందర్భంగా రామన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్జి సబిత మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ నివారణకు రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్నాయని తెలిపారు. అవగాహన లోపంతో ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా, ఆరోగ్య, ఆర్థిక పథకాలపై కూడా కార్మికులకు వివరించారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలపై వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు యాదాసు యాదయ్య, కునూరు శ్రీనివాస్, మార్కెట్ సూపర్వైజర్ ఎం.రమేష్, డైరెక్టర్ జి.నాగేందర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News