Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలల భద్రతకు సమాజం ముందుకు రావాలి: భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 07:48 PM

కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత

కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత

కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత
May 01, 2026 06:19 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కార్మికులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత అన్నారు. మే డే సందర్భంగా రామన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్జి సబిత మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ నివారణకు రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్నాయని తెలిపారు. అవగాహన లోపంతో ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా, ఆరోగ్య, ఆర్థిక పథకాలపై కూడా కార్మికులకు వివరించారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలపై వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు యాదాసు యాదయ్య, కునూరు శ్రీనివాస్, మార్కెట్ సూపర్వైజర్ ఎం.రమేష్, డైరెక్టర్ జి.నాగేందర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News