నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పరిధిలోని నోచ్ ల్యాబ్లో మూడో నంబర్ బ్లాక్లో జరిగిన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఘటన సమయంలో మొత్తం 9 మంది కార్మికులు ఉండగా, అందులో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బొడ్డు బాలకృష్ణ (చిన్నకాపర్తి) అనే కార్మికుడు మృతి
తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
కార్మికుల దినోత్సవం రోజునే ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం కార్మిక వర్గాన్ని కలచివేసింది. స్థానికులు, సహచర కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి