PRINT TIME: May 02, 2026 09:18 PM
కాలువలో మునిగి యువకుడు మృతి
కాలువలో మునిగి యువకుడు మృతి
May 02, 2026 07:34 PM
93 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట,
కాలువలో చేపలు పట్టేందుకు దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రం బండిగూడ గ్రామానికి చెందిన శేహాద్రి కుమార్, అతని బంధువు రాజు ఖిలో (20) సెంట్రింగ్ పనుల కోసం 20 రోజుల క్రితం రామన్నపేటకు వచ్చారు. మే 1న సెలవుదినం కావడంతో ఇద్దరూ, మరో బంధువుతో కలిసి దుబ్బాక మార్గంలో లచ్చిరెడ్డి గూడెం శివారులోని అసిఫ్నగర్ కాలువ వద్ద చేపలు పట్టేందుకు దిగారు.
ఈ సమయంలో రాజు ఖిలో ప్రమాదవశాత్తు లోతైన బురదలో ఇరుక్కొని మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి