Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 09:02 PM

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్
February 23, 2026 07:23 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సింహాద్రిపురం సీఐ, ఎస్ఐ

కడప :కడప జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో సింహాద్రిపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) లు లంచం స్వీకరిస్తూ రంగేహస్తాలుగా పట్టుబడ్డారు.

వివరాల ప్రకారం, ఓ కేసు వ్యవహారంలో సహకారం అందించేందుకు బాధితుడి వద్ద నుంచి నగదు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేసి, లంచం తీసుకుంటున్న సమయంలోనే ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు.

ఎసీబీ డీఎస్పీ నేతృత్వంలో దాడులు

ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, నిందితుల వద్ద నుంచి లంచం నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపగా, అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News