కడదాకా కమ్యూనిస్టుగా… నరసింహకు కన్నీటి వీడ్కోలు
కడదాకా కమ్యూనిస్టుగా… నరసింహకు కన్నీటి వీడ్కోలు
Editor Desk
రామన్నపేట మండలంలోని
సిరిపురం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ పాల సంఘం చైర్మన్ దోమలపల్లి నరసింహ మృతి పార్టీకి, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆయన మృతిచెందగా, మంగళవారం జరిగిన అంతిమయాత్రలో భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా సీనియర్ నాయకుడు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ… నరసింహ చిన్నతనం నుంచే విద్యార్థి, యువజన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని గ్రామ స్థాయి ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. శాఖ సహాయ కార్యదర్శిగా, రెండు సార్లు పాల సంఘం చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ రైతులు, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించారని అన్నారు.
నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి కడదాకా కమ్యూనిస్టుగా జీవించారని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిక్కచ్చిగా ప్రజల పక్షాన నిలిచారని కొనియాడారు. ఆయన అకాల మరణం కుటుంబంతో పాటు పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. నరసింహ ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అంతిమయాత్రలో గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ప్రజానాట్యమండలి కళాకారులు డప్పు వాయిద్యాలతో పాటలు పాడుతూ నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, కందుల హనుమంతు, కల్లూరి నాగేష్, గాదె నరేందర్, ఆవనగంటి నగేష్, ఎండి రషీద్, మునికుంట్ల లెనిన్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటపాక శివకుమార్, గ్రామ శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి