Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేపు ఘనంగా జరగనున్న ఊరడమ్మ, పాపమ్మ అమ్మవార్ల వార్షికోత్సవ బోనాలు 587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 09:34 PM

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం
April 30, 2026 08:04 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, ప్రతినిధి:

కాసిం తాత ఉరుసు సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణ శివారులోని పార్వతాపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఫ్రెండ్లీ కబడ్డీ టోర్నమెంట్ ముగిసింది.

ఫైనల్ మ్యాచ్‌లో యువశక్తి, ఎస్‌జేవీ జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో యువశక్తి జట్టు విజేతగా నిలిచింది. ఎస్‌జేవీ జట్టు ద్వితీయ స్థానం, పార్వతాపురం జట్టు తృతీయ స్థానం సాధించాయి.

విజేతలకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి వెంకటేశులు, గ్రామ పెద్దలు చిన్న లాల్సాబ్, హుసేని, సత్య, సుంకప్ప, మల్లికార్జున, దూద్ పీరు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరుసు సందర్భంగా ప్రతి ఏడాది కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శారీరక క్రీడలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, యువత మొబైల్ గేమ్స్‌కు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News