కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం
కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం
Editor Desk
ఆదోని, ప్రతినిధి:
కాసిం తాత ఉరుసు సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణ శివారులోని పార్వతాపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఫ్రెండ్లీ కబడ్డీ టోర్నమెంట్ ముగిసింది.
ఫైనల్ మ్యాచ్లో యువశక్తి, ఎస్జేవీ జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో యువశక్తి జట్టు విజేతగా నిలిచింది. ఎస్జేవీ జట్టు ద్వితీయ స్థానం, పార్వతాపురం జట్టు తృతీయ స్థానం సాధించాయి.
విజేతలకు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి వెంకటేశులు, గ్రామ పెద్దలు చిన్న లాల్సాబ్, హుసేని, సత్య, సుంకప్ప, మల్లికార్జున, దూద్ పీరు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరుసు సందర్భంగా ప్రతి ఏడాది కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శారీరక క్రీడలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, యువత మొబైల్ గేమ్స్కు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి