జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులు ప్రారంభం
జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులు ప్రారంభం
Komidala Mahender reddy
మొదటి కార్డు మీడియా అకాడెమీ చైర్మన్కు అందజేసిన మంత్రి పొంగులేటి.
రాష్ట్రంలో జర్నలిస్టుల గుర్తింపు, సౌకర్యాల మెరుగుదల దిశగా కీలక అడుగు పడింది. నూతన అక్రిడిటేషన్ కార్డులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి అక్రిడిటేషన్ కార్డును మీడియా అకాడెమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని, వారికి సరైన గుర్తింపు, భద్రత అవసరమని అన్నారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులతో జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు, సౌకర్యాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
అధికారులు వివరించిన మేరకు, ఈ నూతన కార్డుల్లో ఆధునిక భద్రతా లక్షణాలు, డిజిటల్ ధృవీకరణ సదుపాయాలు కల్పించారు. వీటితో నకిలీ కార్డుల సమస్యకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.
కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను వారు స్వాగతిస్తూ, జర్నలిస్టుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి