PRINT TIME: May 05, 2026 03:36 PM
జానమ్మ భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం
జానమ్మ భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం
May 05, 2026 01:42 PM
27 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు గర్దాస్ వేణు తల్లి గర్దాస్ జనమ్మ గుండెపోటుతో మృతి చెందారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మృతురాలి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పుస బాలకిషన్, పల్లివాడ మాజీ సర్పంచ్ గంగుల వెంకట రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దగొని వెంకటేశం, వార్డు సభ్యులు సింగనబోయిన బాలరాజు, రాధారపు మహేష్, కంబాలపెల్లి సత్తయ్య, నల్ల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి