జల సంరక్షణ అందరి బాధ్యత..
జల సంరక్షణ అందరి బాధ్యత..
NM Yadav
నీటిని పొదుపుగా వాడుకోవాలి కలెక్టర్ బి. చంద్రశేఖర్..
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఉండాలి... మేయర్ బుర్రి చైతన్య..
‘జల్ సంచయ్ జన బాగిదారి’ ప్రచార రథం ప్రారంభం..
నల్గొండ : భవిష్యత్ తరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘జల్ సంచయ్ జన బాగిదారి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రచార వాహనం జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తుందని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనల ద్వారా నీటి పొదుపు, వనరుల వినియోగంపై చైతన్య పరుస్తామని వివరించారు. ముఖ్యంగా కమ్యూనిటీ, వ్యక్తిగత ఇంకుడు గుంతల (సోక్ పిట్లు) నిర్మాణం. నీటి నిల్వ పెంచేందుకు ‘ఫామ్ పాండ్స్’ ఏర్పాటు. నీటి సంరక్షణ కట్టడాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
నిబంధనలు కఠినతరం.. మేయర్
నగర మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారు తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకునేలా నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను నీటి పొదుపుపై చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, హౌసింగ్ పిడి రాజ్ కుమార్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్ వున్న జ్ఞానేశ్వరి, కలెక్టరేట్ ఏవో మోతిలాల్, డీఆర్డీఏ సిబ్బంది మరియు సాంస్కృతిక సారథి కళాబృందం పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి