ఇంటర్ ఫలితాల్లో నారాయణ నల్గొండ విద్యార్థుల రాష్ట్ర స్థాయి ప్రతిభ
ఇంటర్ ఫలితాల్లో నారాయణ నల్గొండ విద్యార్థుల రాష్ట్ర స్థాయి ప్రతిభ
Editor Desk
తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ నల్గొండ బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.
విద్యార్థులు ఆమనగంటి సింధు, అలుగుబెల్లి నేహా రెడ్డి అత్యుత్తమ ఫలితాలు సాధించగా, వీరిని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సింధుకు ₹50,000, నేహా రెడ్డికి ₹50,000 ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో విద్యకు అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే JEE మెయిన్స్–2026లో కూడా నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారు.
ఎ. అఖిల్ AIR 480, వై. రామ్ చరణ్ 528, ఎ. శ్రీవల్లి 3442, ఎం.డి. హుసైఫ్ 11,816, వి. అంజనీ దేవి శ్రీ ప్రసాద్ 16,809 ర్యాంకులు సాధించారు. టాప్ 30,000లో మొత్తం 15 ర్యాంకులు సాధించడం గమనార్హం.
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించి సత్కరించింది. కార్యక్రమంలో డీన్ కే. శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం జే. వెంకట్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎన్. శేఖర్ రెడ్డి, ఏవో చంద్రమోహన్ రెడ్డి మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి