Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:25 AM

ఇంటర్ ఫలితాల్లో నారాయణ నల్గొండ విద్యార్థుల రాష్ట్ర స్థాయి ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో నారాయణ నల్గొండ విద్యార్థుల రాష్ట్ర స్థాయి ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో నారాయణ నల్గొండ విద్యార్థుల రాష్ట్ర స్థాయి ప్రతిభ
April 29, 2026 08:56 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ నల్గొండ బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.

విద్యార్థులు ఆమనగంటి సింధు, అలుగుబెల్లి నేహా రెడ్డి అత్యుత్తమ ఫలితాలు సాధించగా, వీరిని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సింధుకు ₹50,000, నేహా రెడ్డికి ₹50,000 ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో విద్యకు అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

అలాగే JEE మెయిన్స్–2026లో కూడా నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారు.

ఎ. అఖిల్ AIR 480, వై. రామ్ చరణ్ 528, ఎ. శ్రీవల్లి 3442, ఎం.డి. హుసైఫ్ 11,816, వి. అంజనీ దేవి శ్రీ ప్రసాద్ 16,809 ర్యాంకులు సాధించారు. టాప్ 30,000లో మొత్తం 15 ర్యాంకులు సాధించడం గమనార్హం.

ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించి సత్కరించింది. కార్యక్రమంలో డీన్ కే. శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం జే. వెంకట్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎన్. శేఖర్ రెడ్డి, ఏవో చంద్రమోహన్ రెడ్డి మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News