విద్యా విధానంలో కీలక మార్పులు ప్రకటించిన ముఖ్యమంత్రి
రాష్ట్రంలో ఇకపై పదో తరగతి పరీక్షలు నిర్వహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియాతో జరిగిన చిట్చాట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.రాష్ట్ర విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు ఒకే విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గిస్తూ, సమగ్ర విద్యను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. కొత్త విధానం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి