న్యాల్కల్,
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం హుమ్నపూర్ గ్రామానికి నూతన సెక్రటరీగా మల్లేశం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ ప్రజలు, నాయకుల సమక్షంలో జరిగిన కార్యక్రమం ఆనందోత్సాహంగా సాగింది.ఈ సందర్భంగా ఇంచార్జ్ సెక్రటరీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందు, కొండ సంతోష్, షరీఫ్, రాజు తదితరులు మల్లేశంను పూలమాలలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. కొత్త బాధ్యతల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.మల్లేశం మాట్లాడుతూ గ్రామంలోని మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక పరిపాలన కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి