Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:43 AM

హుమ్నపూర్ గ్రామ నూతన సెక్రటరీగా మల్లేశం బాధ్యతలు స్వీకరణ

హుమ్నపూర్ గ్రామ నూతన సెక్రటరీగా మల్లేశం బాధ్యతలు స్వీకరణ

హుమ్నపూర్ గ్రామ నూతన సెక్రటరీగా మల్లేశం బాధ్యతలు స్వీకరణ
May 04, 2026 05:12 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం హుమ్నపూర్ గ్రామానికి నూతన సెక్రటరీగా మల్లేశం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ ప్రజలు, నాయకుల సమక్షంలో జరిగిన కార్యక్రమం ఆనందోత్సాహంగా సాగింది.ఈ సందర్భంగా ఇంచార్జ్ సెక్రటరీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందు, కొండ సంతోష్, షరీఫ్, రాజు తదితరులు మల్లేశంను పూలమాలలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. కొత్త బాధ్యతల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.మల్లేశం మాట్లాడుతూ గ్రామంలోని మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక పరిపాలన కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News