Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:31 AM

హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్

హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్

హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్
May 03, 2026 06:41 PM 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ

దేవాలయాల్లో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను వెంటనే అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు, సంబంధిత అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కఠినంగా శిక్షించాలని కోరారు. ఉద్యోగ అవకాశాల విషయంలో యువత అధికారిక ప్రకటనలు, నమ్మకమైన వనరుల ద్వారా ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు.

జిల్లాలో ఇలాంటి మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా అరికట్టడం ప్రభుత్వ బాధ్యత అని, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సమావేశంలో స్పష్టం చేశారు.

సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు పుల్లెంల శ్రీకర్, పతని శ్రీను, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, పాలాది కార్తీక్, కండే యాదగిరి, పోకల శశిధర్, తరి రామకృష్ణ, ఏడుకొండలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News