హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్
హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్
Editor Desk
నల్గొండ
దేవాలయాల్లో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను వెంటనే అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు, సంబంధిత అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కఠినంగా శిక్షించాలని కోరారు. ఉద్యోగ అవకాశాల విషయంలో యువత అధికారిక ప్రకటనలు, నమ్మకమైన వనరుల ద్వారా ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు.
జిల్లాలో ఇలాంటి మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా అరికట్టడం ప్రభుత్వ బాధ్యత అని, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సమావేశంలో స్పష్టం చేశారు.
సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు పుల్లెంల శ్రీకర్, పతని శ్రీను, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, పాలాది కార్తీక్, కండే యాదగిరి, పోకల శశిధర్, తరి రామకృష్ణ, ఏడుకొండలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి