హెచ్పీవీ టీకా సురక్షితమేనా..? కేంద్రం స్పష్టీకరణ..!!
హెచ్పీవీ టీకా సురక్షితమేనా..? కేంద్రం స్పష్టీకరణ..!!
Biksham Goud
ఉచిత టీకా కార్యక్రమంపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్రం
హెచ్పీవీ టీకా సురక్షితతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ టీకా కొత్తది కాదని, 2006 సంవత్సరం నుంచే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు అనేక దేశాలు ఈ టీకాను అమలు చేస్తున్నాయని తెలిపింది. 2022 సంవత్సరం చివరి నాటికే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా మోతాదులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
అనేక అధ్యయనాల్లో సురక్షితమని తేలింది
హెచ్పీవీ టీకాపై జరిగిన అనేక వైద్య అధ్యయనాలు ఇది సురక్షితమని నిర్ధారించాయని కేంద్రం పేర్కొంది. టీకా వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు నమోదుకాలేదని స్పష్టం చేసింది.
గర్భాశయ కర్కాటక వ్యాధి నుంచి రక్షణ
14 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకా ఇవ్వడం ద్వారా గర్భాశయ కర్కాటక వ్యాధి నుంచి 93 నుంచి 100 శాతం వరకు రక్షణ లభిస్తుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వ్యాధి నివారణలో టీకా కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది.
తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని, ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు టీకాలు వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి