Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి
09-05-2026 220 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్కూటీకి పెట్రోల్ అయిపోవడంతో తోసుకుంటూ వెళ్తుండగా ఘటన

హైవేపై స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న లారీ డ్రైవర్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చౌటుప్పల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన మీసాల యాదయ్య (54) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు పేపర్ లోడు తీసుకువచ్చిన ఆయన మల్కాపురం దాబా వద్ద లారీ నిలిపి, స్కూటీపై స్వగ్రామానికి వెళ్లాడు. అనంతరం తిరిగి లారీ వద్దకు వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మల్కాపురం చెరువు సమీపంలో స్కూటీకి పెట్రోల్ అయిపోయింది. దీంతో హైవే పక్కన స్కూటీని తోసుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నంబర్ టీఎస్07 జీజీ 8319గా గుర్తించారు. కారు డ్రైవర్ ధూపాటి కళ్యాణ్ కృష్ణ, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా తెలిపారు. మృతుడి కుమారుడు మీసాల శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి.మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి

Article Image

స్కూటీకి పెట్రోల్ అయిపోవడంతో తోసుకుంటూ వెళ్తుండగా ఘటన

హైవేపై స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న లారీ డ్రైవర్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చౌటుప్పల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన మీసాల యాదయ్య (54) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు పేపర్ లోడు తీసుకువచ్చిన ఆయన మల్కాపురం దాబా వద్ద లారీ నిలిపి, స్కూటీపై స్వగ్రామానికి వెళ్లాడు. అనంతరం తిరిగి లారీ వద్దకు వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మల్కాపురం చెరువు సమీపంలో స్కూటీకి పెట్రోల్ అయిపోయింది. దీంతో హైవే పక్కన స్కూటీని తోసుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నంబర్ టీఎస్07 జీజీ 8319గా గుర్తించారు. కారు డ్రైవర్ ధూపాటి కళ్యాణ్ కృష్ణ, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా తెలిపారు. మృతుడి కుమారుడు మీసాల శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి.మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News