Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐఏసీఈ చరిత్ర సృష్టించింది గ్రాండ్ సక్సెస్ మీట్‌లో చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రావు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ పుట్టపర్తి లో యుద్దావిమానాల తయారీ కేంద్రానికి భూమిపూజ చేయనున్న సీఎం బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 10:54 PM

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి
May 09, 2026 09:27 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్కూటీకి పెట్రోల్ అయిపోవడంతో తోసుకుంటూ వెళ్తుండగా ఘటన

హైవేపై స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న లారీ డ్రైవర్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చౌటుప్పల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన మీసాల యాదయ్య (54) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు పేపర్ లోడు తీసుకువచ్చిన ఆయన మల్కాపురం దాబా వద్ద లారీ నిలిపి, స్కూటీపై స్వగ్రామానికి వెళ్లాడు. అనంతరం తిరిగి లారీ వద్దకు వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మల్కాపురం చెరువు సమీపంలో స్కూటీకి పెట్రోల్ అయిపోయింది. దీంతో హైవే పక్కన స్కూటీని తోసుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నంబర్ టీఎస్07 జీజీ 8319గా గుర్తించారు. కారు డ్రైవర్ ధూపాటి కళ్యాణ్ కృష్ణ, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా తెలిపారు. మృతుడి కుమారుడు మీసాల శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి.మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News