Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:02 PM

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి

హైవేపై కారు ఢీకొని లారీ డ్రైవర్ మృతి
May 09, 2026 09:27 PM 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్కూటీకి పెట్రోల్ అయిపోవడంతో తోసుకుంటూ వెళ్తుండగా ఘటన

హైవేపై స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న లారీ డ్రైవర్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చౌటుప్పల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన మీసాల యాదయ్య (54) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు పేపర్ లోడు తీసుకువచ్చిన ఆయన మల్కాపురం దాబా వద్ద లారీ నిలిపి, స్కూటీపై స్వగ్రామానికి వెళ్లాడు. అనంతరం తిరిగి లారీ వద్దకు వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మల్కాపురం చెరువు సమీపంలో స్కూటీకి పెట్రోల్ అయిపోయింది. దీంతో హైవే పక్కన స్కూటీని తోసుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నంబర్ టీఎస్07 జీజీ 8319గా గుర్తించారు. కారు డ్రైవర్ ధూపాటి కళ్యాణ్ కృష్ణ, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా తెలిపారు. మృతుడి కుమారుడు మీసాల శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి.మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News