Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన! జిమ్ ట్రైనర్ మృతి కేసులో మహిళ అరెస్ట్ వేధింపులే కారణమా..? పోలీసుల దర్యాప్తు కొనసాగింపు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 04:23 PM

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..?

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..?

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..?
April 14, 2026 12:48 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కోర్టు వివాదంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేసిన ఘటనపై హైడ్రా వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తూ గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

సూరారం గ్రామంలో తనకు చెందిన రెండు స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేసిందని జితేంద్ర అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టు ముందుగా ఆ స్థలంపై ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, ఆ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అర్ధరాత్రి సమయంలో స్థలానికి వెళ్లి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారని బాధితుడు మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు, హైడ్రా వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

“హైడ్రా కోర్టుల కంటే గొప్పదని భావిస్తున్నారా..? ప్రభుత్వంతో సమాంతరంగా పనిచేస్తున్నామనుకుంటున్నారా..?” అంటూ ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలాంటి చర్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత శాఖలు ఆదేశాలు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ, 48 గంటల్లో బోర్డులు తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News