స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్
విస్సన్నపేట మండల కేంద్రంలో ముతరాసి పాలెం గ్రామానికి చెందిన తానంకి శ్రీ చరణ్ (13) నరసాపురం ఊర చెరువు కు బహిర్ భూమికి వెళ్లిన సమయంలో చెరువులోకి జారి మృతి చెందడం జరిగింది. వివరాలలోకి వెళితే తిరువూరు గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి సంక్రాంతి సెలవులకు తన జన్మస్థలమైన మత రాశి పాలెం గ్రామానికి రావడం జరిగింది. ఉదయం బహిర్ భూమికి వెళ్ళిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని చెరువులో ప్రోక్లైన్లతో మట్టితోకాలు జరపటం వలన కోపులు ఏర్పడ్డాయని స్థానికులు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వైసీపీఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తానంకి రాంబాబు,సీనియర్ నాయకులు గణపతి రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి