PRINT TIME: April 29, 2026 05:39 AM
గుండెపోటుతో మృతి చెందిన కాశీరాములు కుటుంబానికి ఆర్థిక సహాయం
గుండెపోటుతో మృతి చెందిన కాశీరాములు కుటుంబానికి ఆర్థిక సహాయం
April 29, 2026 03:53 AM
9 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామానికి చెందిన తెలగమళ్ల కాశీరాములు (67) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ సురిగి రమేష్ గౌడ్ మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీరాములు మరణం కుటుంబానికి తీరని లోటని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కాశీ మల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి