గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు
గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ రైతులు మంగళవారం తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ దయానంద కు రైతులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా కొనుగోలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని తాసిల్దార్ కు తమ గోడును వినిపించారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి వారు మాట్లాడుతూ... గ్రామంలో కొని కారణాలవల్ల 2ఐకేపి సెంటర్లో సంఘం బంధం ఏజెన్సీలను తీసివేయడం జరిగిందని అన్నారు. వారు స్థానంలో ప్రభుత్వం తరఫున పిఎస్ కు అప్ప చెప్పడం జరిగిందని అన్నారు. రైతులు ఎవరు అధర్యపడవద్దని తాము తెచ్చిన ధాన్యాన్ని కాంట పెట్టి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి