గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన
గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో నిర్మించిన బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలని గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ...
కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , మాజీ ఎమ్మెల్యే కిషోర్ లు సంయుక్తంగా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం చేస్తే తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఎండ్లైన పూర్తి చేయక పోవడం వలన గొట్టిపర్తి ,పోచారం, కర్ణాలకుంట తండా,సంధ్యాతండ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రభుత్వం తొ మాట్లాడి మిగిలిఉన్న పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు తునికి సాయిలు, హరిబాబు. యాకన్న. సురేష్. సమ్మద్. నాగేష్. ప్రవీణ్. భాస్కర్. రాజు. చిట్టి. బాబూ రావు. కూకట్ల యాకన్న. మద్దెల నరేష్. ఓడ వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి