గోరంట్లలో స్వచ్ఛరథం పుష్ కార్ట్ల పంపిణి
గోరంట్లలో స్వచ్ఛరథం పుష్ కార్ట్ల పంపిణి
Prakash
గోరంట్ల,: శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం పుష్ కార్ట్ సైకిళ్ల పంపిణి కార్యక్రమం గురువారం నిర్వహించారు. గోరంట్ల మేజర్ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ కమలాభాయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి యస్. సవితమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తహసీల్దార్ మధునాయక్, టీడీపీ జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షుడు బెల్లల చెరువు చంద్ర, పంచాయతీ కార్యదర్శి సంజయ్ నాయక్ పాల్గొన్నారు.
అలాగే మాజీ సర్పంచ్లు నాగే నాయక్, ఉత్తమరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నబిరసూల్, 5మెన్ కమిటీ సభ్యుడు గంగాధర్, జనసేన మండల అధ్యక్షుడు సంతోష్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, మాజీ వార్డు సభ్యుడు పసుపులేటి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పుష్ కార్ట్లను లబ్ధిదారులకు అందజేశారు. గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి