PRINT TIME: April 29, 2026 05:34 AM
గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు
గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు
April 29, 2026 03:59 AM
4 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మిర్యాలగూడ, ఏప్రిల్ 28: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గోగువారిగూడెంలో కిశోర బాలిక స్నేహ సంఘాల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
సదస్సుకు గ్రామ సర్పంచ్ కొండా అరుణ ముఖ్య అతిథిగా హాజరై బాలికలను ఉద్దేశించి మాట్లాడారు. బాలికలు విద్యను ప్రాధాన్యంగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామంలో బాలికల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు బాలికల ఆరోగ్యం, పోషణ, విద్య, శుభ్రత, హైజిన్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నివారణపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బందనకంటి ఝాన్సీరాణి, జంగమల్లీశ్వరి, వి.బి.కే యశోద, ఆయాలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి