Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 05:34 AM

గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు

గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు

గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు
April 29, 2026 03:59 AM 4 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ, ఏప్రిల్ 28: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గోగువారిగూడెంలో కిశోర బాలిక స్నేహ సంఘాల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

సదస్సుకు గ్రామ సర్పంచ్ కొండా అరుణ ముఖ్య అతిథిగా హాజరై బాలికలను ఉద్దేశించి మాట్లాడారు. బాలికలు విద్యను ప్రాధాన్యంగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామంలో బాలికల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు బాలికల ఆరోగ్యం, పోషణ, విద్య, శుభ్రత, హైజిన్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నివారణపై ప్రత్యేకంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బందనకంటి ఝాన్సీరాణి, జంగమల్లీశ్వరి, వి.బి.కే యశోద, ఆయాలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News