Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 01:24 AM

గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు

గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు

గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు
April 29, 2026 03:59 AM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ, ఏప్రిల్ 28: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గోగువారిగూడెంలో కిశోర బాలిక స్నేహ సంఘాల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

సదస్సుకు గ్రామ సర్పంచ్ కొండా అరుణ ముఖ్య అతిథిగా హాజరై బాలికలను ఉద్దేశించి మాట్లాడారు. బాలికలు విద్యను ప్రాధాన్యంగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామంలో బాలికల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు బాలికల ఆరోగ్యం, పోషణ, విద్య, శుభ్రత, హైజిన్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నివారణపై ప్రత్యేకంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బందనకంటి ఝాన్సీరాణి, జంగమల్లీశ్వరి, వి.బి.కే యశోద, ఆయాలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News