ఘనంగా బి.ఆర్.ఎస్. ఆవిర్భావ వేడుకలు
ఘనంగా బి.ఆర్.ఎస్. ఆవిర్భావ వేడుకలు
K.RAVI
స్థానిక మున్సిపాలిటీ పరిధిలో బి.ఆర్.ఎస్. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని గులాబీ జెండాను ఆవిష్కరించారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బి.ఆర్.ఎస్), నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2014లో స్వరాష్ట్రాన్ని సాధించి, దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ దేనని వారు కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ వేడుకల్లో భాగంగా ప్రజలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా పాదచారులకు, ప్రజలకు ఉపశమనం కలిగించేలా మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కన్వీనర్ బొమ్మ రెడ్డి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్స్ కొయ్యడ శేఖర్, ఉదరి యాదయ్య, ఉడుగు మల్లేశం, తాడూరి పరమేష్, మునుకుంట్ల సత్యనారాయణ,ఢిల్లీ శంకర్ రెడ్డి, ఎండి అతర్ పాషా, ఎండి మున్నా, జమీర్, చుక్క యాదయ్య, చేవగోని మహేష్ గౌడ్, జాని యాదవ్, ఊదరి శ్యామ్, గుండెబోయిన వెంకటేశం యాదవ్, నాగరాజు, ఆరుట్ల లింగస్వామి, ఇమ్మడి ఈశ్వర్, ఊదరి రాజేష్,అత్తు, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి