శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం పెద్దమంతూరు పంచాయతీ ఎల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన టీచర్ మల్లికార్జున ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. మల్లికార్జున ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని మల్లికార్జునకు మద్దతు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి