Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకిషన్ ఘాటు వ్యాఖ్యాలు డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 07:20 PM

గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్‌ఎస్‌సీలో 583 మార్కులు

గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్‌ఎస్‌సీలో 583 మార్కులు

గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్‌ఎస్‌సీలో 583 మార్కులు
April 30, 2026 06:05 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండలోని గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరోసారి మెరుగైన ఫలితాలతో తమ ప్రతిభను చాటుకుంది. తాజాగా విడుదలైన తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థిని జయంతి 600 మార్కులకు గాను 583 మార్కులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది.

జయంతి సాధించిన ఈ ఘనత పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు గర్వకారణంగా మారింది. ఆమె కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, పాఠశాల అందించిన నాణ్యమైన విద్య ఈ విజయానికి కారణమని యాజమాన్యం పేర్కొంది.

ఇక పాఠశాల మొత్తంగా కూడా మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. మొత్తం 60 మంది విద్యార్థుల్లో ఐదుగురు 560కు పైగా మార్కులు, 12 మంది 550కు పైగా మార్కులు సాధించారు. పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.

విద్యార్థుల విజయాలను అభినందిస్తూ చైర్మన్ నింబరి రమేష్ రెడ్డి, కరెస్పాండెంట్ ఎన్. శిరీషా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించిందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కీలకమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News