గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్ఎస్సీలో 583 మార్కులు
గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్ఎస్సీలో 583 మార్కులు
Editor Desk
నల్గొండలోని గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరోసారి మెరుగైన ఫలితాలతో తమ ప్రతిభను చాటుకుంది. తాజాగా విడుదలైన తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థిని జయంతి 600 మార్కులకు గాను 583 మార్కులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచింది.
జయంతి సాధించిన ఈ ఘనత పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు గర్వకారణంగా మారింది. ఆమె కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, పాఠశాల అందించిన నాణ్యమైన విద్య ఈ విజయానికి కారణమని యాజమాన్యం పేర్కొంది.
ఇక పాఠశాల మొత్తంగా కూడా మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. మొత్తం 60 మంది విద్యార్థుల్లో ఐదుగురు 560కు పైగా మార్కులు, 12 మంది 550కు పైగా మార్కులు సాధించారు. పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.
విద్యార్థుల విజయాలను అభినందిస్తూ చైర్మన్ నింబరి రమేష్ రెడ్డి, కరెస్పాండెంట్ ఎన్. శిరీషా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించిందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కీలకమని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి