గౌస్ నగర్లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ
గౌస్ నగర్లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ
Sthanikam District Staff Reporter
తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార యూనియన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ దంపతులు...
భువనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామంలో నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార యూనియన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్,ఆయన సతీమణి దూదిమెట్ల రాజేశ్వరి పరామర్శించారు. పాక జహంగీర్ గారి తండ్రి పాక కొమురయ్య యాదవ్ ఈ ఏప్రిల్ నెల 22న అనారోగ్యంతో మరణించగా, ఆదివారం వారి చిత్రా పటానికి పూలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా బాలరాజు యాదవ్ దంపతులు కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రాసాల మల్లేష్ యాదవ్, గౌస్ నగర్ మాజీ ఉపసర్పంచ్ సాయిరెడ్డి పోసిరెడ్డి,గ్రామ పెద్దలు పాశం రామ్ రెడ్డి,ఎలిమినేటి సత్తిరెడ్డి, నల్ల మాసు చంద్రమల్లయ్య,చుక్కల వెంకటేష్ యాదవ్,కుటుంబ సభ్యులు పాక మల్లేష్,పాక నర్సింహా తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి