PRINT TIME: May 04, 2026 08:30 PM
గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు
గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు
May 04, 2026 06:42 PM
32 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో వేగం పెంచాలి.
రామన్నపేట మండలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని ఎంపీడీవో హెచ్చరించారు. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూలీల సంఖ్య పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, పనులు సకాలంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షణ పెంచాలని అన్నారు.
ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ మండల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి