గ్రామాభివృద్ధే లక్ష్యంగా ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ ఆవిర్భావం
గ్రామాభివృద్ధే లక్ష్యంగా ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ ఆవిర్భావం
K.RAVI
ఆలయ పునర్నిర్మాణానికి రూ.5 లక్షల భారీ విరాళం
గ్రామ రక్షణకు 7 సీసీ కెమెరాల అందజేత
లింగవారిగూడెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: కత్తుల చైతన్య
గ్రామాభివృద్ధి, సామాజిక సేవే లక్ష్యంగా లింగవారిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ను నారాయణపురం ఎస్ఐ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కత్తుల చైతన్య తన సొంత సంపాదన నుండి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం చెక్కును అందజేశారు. అలాగే గ్రామ భద్రత కోసం 7 సీసీ కెమెరాలను బహూకరించారు. తన జన్మభూమిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చైతన్య పేర్కొనగా, చిన్న వయసులోనే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎస్ఐ జగన్, గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్తుల జ్యోతి వాసు, డి సి సి ఎగ్జిక్యూటివ్ సభ్యులు కత్తుల లక్ష్మయ్య, ఉపసర్పంచ్ లింగారెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి