గ్రామ సేవకుల కృషి అమూల్యం: సర్పంచ్ సాయికుమార్ గౌడ్
గ్రామ సేవకుల కృషి అమూల్యం: సర్పంచ్ సాయికుమార్ గౌడ్
Editor Desk
రామన్నపేట, మే 1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రామన్నపేట మండలం బోగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బందిని ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, పారిశుధ్య సిబ్బంది, కార్యాలయ సిబ్బందికి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎండ, వాన తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్న కార్మికుల సేవలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వారి సంక్షేమానికి పంచాయతీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు ప్రమీల, మానస, అండాలు యాదగిరి, పంచాయతీ కార్యదర్శి అయ్యప్పరెడ్డి, సిబ్బంది మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి