PRINT TIME: May 11, 2026 08:10 PM
గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం
గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం
May 11, 2026 06:32 PM
1 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీలకు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలు 6 నెలలుగా నిరంతర అన్నదానం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి రోజు వైద్యశాలకు విచ్చేసే గర్భిణీలకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా గర్భిణీలకు భోజనం వడ్డించి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి సవిత చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఊరటనిచ్చిందని, ప్రజా సేవలో ఇది ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి