Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:11 PM

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం
May 11, 2026 06:32 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీలకు ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలు 6 నెలలుగా నిరంతర అన్నదానం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.


ప్రతి రోజు వైద్యశాలకు విచ్చేసే గర్భిణీలకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా గర్భిణీలకు భోజనం వడ్డించి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మంత్రి సవిత చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఊరటనిచ్చిందని, ప్రజా సేవలో ఇది ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News