Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి – సీపీఎం నేత చుక్క రాములు పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 11, 2026 08:10 PM

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం
May 11, 2026 06:32 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీలకు ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలు 6 నెలలుగా నిరంతర అన్నదానం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.


ప్రతి రోజు వైద్యశాలకు విచ్చేసే గర్భిణీలకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా గర్భిణీలకు భోజనం వడ్డించి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మంత్రి సవిత చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఊరటనిచ్చిందని, ప్రజా సేవలో ఇది ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News