గిరిజన విద్యార్థులకు ‘బెస్ట్ అవైలబుల్’ అవకాశం..
గిరిజన విద్యార్థులకు ‘బెస్ట్ అవైలబుల్’ అవకాశం..
NM Yadav
జిల్లాకు 84 సీట్లు మంజూరు ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు..
వివరాలు వెల్లడించిన జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి..
నల్లగొండ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘బెస్ట్ అవైలబుల్’ పాఠశాలల పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నల్లగొండ జిల్లాకు ఈ ఏడాది మొత్తం 84 సీట్లు మంజూరయ్యాయని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (DTDO) ఒక ప్రకటనలో తెలిపారు.
మొత్తం మంజూరైన సీట్లలో రిజర్వేషన్ల వారీగా కేటాయింపులు జరిపారు. ఎస్.టి లంబాడ విద్యార్థులకు 71 సీట్లు, ఎస్.టి ఎరుకల విద్యార్థులకు 05 సీట్లు, పి.టి.జి (చెంచు) కులాల వారికి 08 సీట్లు కేటాయించారు.
అర్హతలు - నిబంధనలు..
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ. 2.00 లక్షలకు మించకూడదు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 7వ తేదీ (07.05.2026) లోపు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. అప్లికేషన్ వెంట జతచేయాల్సిన పత్రాలు...
- కుల ధృవీకరణ పత్రం (Caste Certificate)
- ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
- ఆధార్ కార్డు నకలు
- ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుండి బోనఫైడ్ సర్టిఫికేట్
- రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు...అర్హులైన గిరిజన విద్యార్థులు తమ దరఖాస్తులను నల్లగొండ కలెక్టరేట్ కాంప్లెక్స్లోని ‘సంక్షేమ భవన్’లో ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలి. ఇతర వివరాల కోసం 9515181080 నంబర్ను సంప్రదించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి