Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 08:37 AM

గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత

గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత

గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత
April 28, 2026 06:40 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో గగన్ మహల్ సమీపంలోని పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జా ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. కొందరు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా, వెంటనే స్పందించిన తెలుగుదేశంపార్టీ (తెదేపా) నాయకులు కన్వీనర్ శ్రీరాములు తదితరులు కబ్జాను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో, ఇటీవల ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థను కూడా కొందరు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమాచారం అందుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాఘవన్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ భూములపై అక్రమ కబ్జాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పురావస్తు ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని రక్షించడంతో పాటు, ప్రజా సౌకర్యాలను కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News