Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:00 AM

గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత

గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత

గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత
28-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో గగన్ మహల్ సమీపంలోని పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జా ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. కొందరు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా, వెంటనే స్పందించిన తెలుగుదేశంపార్టీ (తెదేపా) నాయకులు కన్వీనర్ శ్రీరాములు తదితరులు కబ్జాను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో, ఇటీవల ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థను కూడా కొందరు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమాచారం అందుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాఘవన్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ భూములపై అక్రమ కబ్జాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పురావస్తు ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని రక్షించడంతో పాటు, ప్రజా సౌకర్యాలను కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.


Sthanikam

గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో గగన్ మహల్ సమీపంలోని పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జా ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. కొందరు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా, వెంటనే స్పందించిన తెలుగుదేశంపార్టీ (తెదేపా) నాయకులు కన్వీనర్ శ్రీరాములు తదితరులు కబ్జాను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో, ఇటీవల ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థను కూడా కొందరు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమాచారం అందుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాఘవన్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ భూములపై అక్రమ కబ్జాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పురావస్తు ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని రక్షించడంతో పాటు, ప్రజా సౌకర్యాలను కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News