గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్డిఏ ఆగ్రహం
గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్డిఏ ఆగ్రహం
EDIGA NAVEENKUMAR
పెనుకొండ పట్టణంలోని గగన్ మహల్ సమీపంలో దేవాదాయ & పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఎన్డిఏ కూటమి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గగన్ మహల్–తిమ్మరసు బందిఖానా మధ్య ఉన్న భూమిని కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.
నాయకులు స్థలాన్ని పరిశీలించి, తోట వెంకటస్వామి తన కుమారులతో కలిసి భూమిని ఆక్రమించడంతో పాటు రూ.12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా, ధర్మవరం చెందిన కట్టా శ్రీదేవి తదితరులు ఈ ఆక్రమణకు సహకరించినట్లు తెలిపారు.
గగన్ మహల్ వంటి చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, ధ్వంసమైన మౌలిక వసతులకు నష్టపరిహారం వసూలు చేయాలని కోరారు.
ఈ విషయంపై ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించడంతో పాటు జిల్లా కలెక్టర్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి