Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 06:32 PM

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం
April 28, 2026 04:15 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ పట్టణంలోని గగన్ మహల్ సమీపంలో దేవాదాయ & పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ కూటమి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గగన్ మహల్–తిమ్మరసు బందిఖానా మధ్య ఉన్న భూమిని కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.

నాయకులు స్థలాన్ని పరిశీలించి, తోట వెంకటస్వామి తన కుమారులతో కలిసి భూమిని ఆక్రమించడంతో పాటు రూ.12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా, ధర్మవరం చెందిన కట్టా శ్రీదేవి తదితరులు ఈ ఆక్రమణకు సహకరించినట్లు తెలిపారు.

గగన్ మహల్ వంటి చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, ధ్వంసమైన మౌలిక వసతులకు నష్టపరిహారం వసూలు చేయాలని కోరారు.

ఈ విషయంపై ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించడంతో పాటు జిల్లా కలెక్టర్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News