Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:00 AM

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం
28-04-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ పట్టణంలోని గగన్ మహల్ సమీపంలో దేవాదాయ & పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ కూటమి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గగన్ మహల్–తిమ్మరసు బందిఖానా మధ్య ఉన్న భూమిని కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.

నాయకులు స్థలాన్ని పరిశీలించి, తోట వెంకటస్వామి తన కుమారులతో కలిసి భూమిని ఆక్రమించడంతో పాటు రూ.12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా, ధర్మవరం చెందిన కట్టా శ్రీదేవి తదితరులు ఈ ఆక్రమణకు సహకరించినట్లు తెలిపారు.

గగన్ మహల్ వంటి చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, ధ్వంసమైన మౌలిక వసతులకు నష్టపరిహారం వసూలు చేయాలని కోరారు.

ఈ విషయంపై ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించడంతో పాటు జిల్లా కలెక్టర్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Sthanikam

గగన్ మహల్ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ ఆగ్రహం

Article Image

పెనుకొండ పట్టణంలోని గగన్ మహల్ సమీపంలో దేవాదాయ & పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఎన్‌డిఏ కూటమి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గగన్ మహల్–తిమ్మరసు బందిఖానా మధ్య ఉన్న భూమిని కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.

నాయకులు స్థలాన్ని పరిశీలించి, తోట వెంకటస్వామి తన కుమారులతో కలిసి భూమిని ఆక్రమించడంతో పాటు రూ.12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా, ధర్మవరం చెందిన కట్టా శ్రీదేవి తదితరులు ఈ ఆక్రమణకు సహకరించినట్లు తెలిపారు.

గగన్ మహల్ వంటి చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, ధ్వంసమైన మౌలిక వసతులకు నష్టపరిహారం వసూలు చేయాలని కోరారు.

ఈ విషయంపై ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించడంతో పాటు జిల్లా కలెక్టర్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News