Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:55 PM

గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు

గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు

 గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు
May 11, 2026 02:24 PM 167 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు 5నెలలు వేతనాలు ఇవ్వకుంటే గడ్డి తిని బతకాలా? అని కార్మికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొత్తచెరువులో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరవ రోజుకు చేరుకుంది. కార్మికులు గడ్డి తింటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ... గత ఐదు నెలల నుంచి వేతనాలు ఇవ్వక తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నాయన్నారు. దీనిని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా అధికారులు కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజాసంఘాలతో కలిసి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాము, మధుసూదన్, శ్రీనివాసులు,రాములప్ప, రంగనాథ్ ఓబులేష్ నాగేంద్ర,లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News