గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు
గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు
Anjali
శ్రీ సత్య సాయి నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు 5నెలలు వేతనాలు ఇవ్వకుంటే గడ్డి తిని బతకాలా? అని కార్మికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొత్తచెరువులో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరవ రోజుకు చేరుకుంది. కార్మికులు గడ్డి తింటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ... గత ఐదు నెలల నుంచి వేతనాలు ఇవ్వక తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నాయన్నారు. దీనిని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా అధికారులు కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజాసంఘాలతో కలిసి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాము, మధుసూదన్, శ్రీనివాసులు,రాములప్ప, రంగనాథ్ ఓబులేష్ నాగేంద్ర,లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి