Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎల్బీ స్టేడియానికి భారీగా తరలిన హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు “விஜய் வாக்குறுதிகளை நிறைவேற்றுவார் என நம்புகிறேன்”... ராகுல் காந்தி வாழ்த்து సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 11, 2026 04:21 PM

గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు

గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు

 గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు
May 11, 2026 02:24 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు 5నెలలు వేతనాలు ఇవ్వకుంటే గడ్డి తిని బతకాలా? అని కార్మికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొత్తచెరువులో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరవ రోజుకు చేరుకుంది. కార్మికులు గడ్డి తింటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ... గత ఐదు నెలల నుంచి వేతనాలు ఇవ్వక తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నాయన్నారు. దీనిని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా అధికారులు కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజాసంఘాలతో కలిసి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాము, మధుసూదన్, శ్రీనివాసులు,రాములప్ప, రంగనాథ్ ఓబులేష్ నాగేంద్ర,లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News