సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై శివతేజపై ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు.
ఇటీవల ఒక మహిళ తనను ఒక వ్యక్తి వేధించాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, అనంతరం అదే ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్సైకు వాయిస్ మెసేజ్ పంపగా, స్టేషన్కు వచ్చి వివరాలు తెలియజేయాలని సూచించినట్లు బాధిత మహిళ విచారణలో వెల్లడించిందని చెప్పారు.
పోలీసులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాటిపై తప్పనిసరిగా అంతర్గత విచారణ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. విచారణలో ఎవరు తప్పు చేసినట్లు తేలినా, ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ వ్యవస్థపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి