PRINT TIME: July 03, 2026 03:23 AM
ఎస్ఎస్సీ ఫలితాల్లో శాస్త్ర పాఠశాల విజయకేతనం
ఎస్ఎస్సీ ఫలితాల్లో శాస్త్ర పాఠశాల విజయకేతనం
April 30, 2026 08:11 AM
29 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న శాస్త్ర పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.
ఈ ఫలితాల్లో పి. హరిస్మిత 569 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, మణికంఠ సాయి 543, ఎన్. లక్ష్మీ ప్రసన్న 540 మార్కులు సాధించారు. మొత్తం 33 మంది విద్యార్థుల్లో 13 మందికి పైగా 500కి పైగా మార్కులు సాధించడం గమనార్హం.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కే. కిషోర్ కుమార్ విద్యార్థులను అభినందించారు. “ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థిలోని సృజనాత్మకతను వెలికితీసి, ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే శాస్త్ర పాఠశాల లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని, విజయాన్ని సాధించిన విద్యార్థులను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి