Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 03:37 PM

ఏపూర్ జెడ్పీ హై స్కూల్‌లో ఎస్‌ఎస్‌సీ ప్రతిభావంతుల సన్మానం ఘనంగా

ఏపూర్ జెడ్పీ హై స్కూల్‌లో ఎస్‌ఎస్‌సీ ప్రతిభావంతుల సన్మానం ఘనంగా

ఏపూర్ జెడ్పీ హై స్కూల్‌లో ఎస్‌ఎస్‌సీ ప్రతిభావంతుల సన్మానం ఘనంగా
May 05, 2026 01:35 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్‌లో 2026 సంవత్సరపు ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోలు పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముందు గ్రామంలోని అన్ని వీధుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, బడిఈడు కలిగిన తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభలో గ్రామ సర్పంచ్ పాలెం మహేష్, ప్రధానోపాధ్యాయుడు బి. మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. గ్రామ ప్రముఖులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడం ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. 573 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా, జిల్లాలో 4వ స్థానం పొందిన తర్ర అఖిల్ (కృష్ణయ్య కుమారుడు)ను ప్రత్యేకంగా సన్మానించారు. అలాగే పాఠశాలలో రెండో స్థానంలో నిలిచిన పంతంగి లక్ష్మీ ప్రసన్న (లింగస్వామి కుమార్తె), మూడో స్థానంలో నిలిచిన తర్ర శివమణి, నాలుగో స్థానంలో నిలిచిన సురిగి భవాని సహా 500కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో మాట్లాడిన గ్రామ పెద్దలు, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా పాఠశాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News