Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్ క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 06:49 PM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి యత్నం స్టేజిపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు..

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి యత్నం స్టేజిపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు..

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి యత్నం స్టేజిపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు..
May 03, 2026 04:27 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ హామీల అమలుపై విమర్శలు చేయడంతో అక్కడున్న కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మా పార్టీ గుర్తుపై గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా” అంటూ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి దూసుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో మల్లన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో కార్యక్రమం కొంతసేపు ఉద్రిక్తంగా మారింది.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మల్లన్న మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే అనుచరుల ప్రేరేపణ ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News