Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:06 AM

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
01-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ డివిజన్ పరిధిలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఎగరవేసి కార్మికుల ఐక్యతను ప్రతిబింబించారు.ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుడు అల్లే రమేష్, డివిజన్ కార్యదర్శి గంగుల సోమేశ్వర రెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శి తిరుమలయ్య, సీనియర్ నాయకులు షకీల్, సుధాకర్ నాయకత్వం వహించారు. డివిజన్ పరిధిలోని ఐదు సెక్షన్లలో జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. రామన్నపేటలో రాములు, చాంద్ పాషా, వలిగొండలో గాజుల మహేష్, నారాయణపురంలో మీసాల శ్రవణ్ కుమార్, పోచంపల్లిలో బాబురావు, చౌటుప్పల్‌లో కడగంచి ప్రభు, మిస్బౌద్దీన్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి గంగుల సోమేశ్వర రెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం 1104 యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

Article Image

చౌటుప్పల్ డివిజన్ పరిధిలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఎగరవేసి కార్మికుల ఐక్యతను ప్రతిబింబించారు.ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుడు అల్లే రమేష్, డివిజన్ కార్యదర్శి గంగుల సోమేశ్వర రెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శి తిరుమలయ్య, సీనియర్ నాయకులు షకీల్, సుధాకర్ నాయకత్వం వహించారు. డివిజన్ పరిధిలోని ఐదు సెక్షన్లలో జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. రామన్నపేటలో రాములు, చాంద్ పాషా, వలిగొండలో గాజుల మహేష్, నారాయణపురంలో మీసాల శ్రవణ్ కుమార్, పోచంపల్లిలో బాబురావు, చౌటుప్పల్‌లో కడగంచి ప్రభు, మిస్బౌద్దీన్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి గంగుల సోమేశ్వర రెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం 1104 యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News