ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
K.RAVI
చౌటుప్పల్ డివిజన్ పరిధిలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఎగరవేసి కార్మికుల ఐక్యతను ప్రతిబింబించారు.ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుడు అల్లే రమేష్, డివిజన్ కార్యదర్శి గంగుల సోమేశ్వర రెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శి తిరుమలయ్య, సీనియర్ నాయకులు షకీల్, సుధాకర్ నాయకత్వం వహించారు. డివిజన్ పరిధిలోని ఐదు సెక్షన్లలో జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. రామన్నపేటలో రాములు, చాంద్ పాషా, వలిగొండలో గాజుల మహేష్, నారాయణపురంలో మీసాల శ్రవణ్ కుమార్, పోచంపల్లిలో బాబురావు, చౌటుప్పల్లో కడగంచి ప్రభు, మిస్బౌద్దీన్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి గంగుల సోమేశ్వర రెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం 1104 యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి