Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:54 PM

ఎల్బీ స్టేడియానికి భారీగా తరలిన హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

ఎల్బీ స్టేడియానికి భారీగా తరలిన హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

ఎల్బీ స్టేడియానికి భారీగా తరలిన హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
May 11, 2026 04:16 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా చేపట్టిన “విద్యా వారోత్సవాల” కార్యక్రమానికి హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని LB స్టేడియం లో నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు కళాశాల బృందం ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు .

ఈ నెల 11 నుంచి 17 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా యువతలో సామాజిక బాధ్యత, రాష్ట్ర అభివృద్ధిపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బస్సుల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా సభకు బయలుదేరారు.

ముఖ్యమంత్రి ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రగతి ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబర్చారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విభాగాలు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశాయి.

ఇక విద్యా వారోత్సవాల సందర్భంగా కళాశాల ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో సంభవ్ ఫౌండేషన్, ప్రథమ్ ఫౌండేషన్‌లతో శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావడం ద్వారా సామాజిక బాధ్యత పట్ల అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియం విద్యార్థుల నినాదాలు, ఉత్సాహంతో కోలాహలంగా మారింది.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిర, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News