ఎల్బీ స్టేడియానికి భారీగా తరలిన హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
ఎల్బీ స్టేడియానికి భారీగా తరలిన హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
Editor Desk
హయత్నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా చేపట్టిన “విద్యా వారోత్సవాల” కార్యక్రమానికి హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం హైదరాబాద్లోని LB స్టేడియం లో నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు కళాశాల బృందం ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు .
ఈ నెల 11 నుంచి 17 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా యువతలో సామాజిక బాధ్యత, రాష్ట్ర అభివృద్ధిపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బస్సుల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా సభకు బయలుదేరారు.
ముఖ్యమంత్రి ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రగతి ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబర్చారు. కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాలు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశాయి.
ఇక విద్యా వారోత్సవాల సందర్భంగా కళాశాల ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో సంభవ్ ఫౌండేషన్, ప్రథమ్ ఫౌండేషన్లతో శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావడం ద్వారా సామాజిక బాధ్యత పట్ల అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియం విద్యార్థుల నినాదాలు, ఉత్సాహంతో కోలాహలంగా మారింది.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిర, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి