ఏడవ వార్డుఅభివృద్ధి నా బాధ్యత వేముల వీరేశం
ఏడవ వార్డుఅభివృద్ధి నా బాధ్యత వేముల వీరేశం
Komidala Mahender reddy
నకిరేకల్ నియోజకవర్గం
చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 07వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దేశపాక లత–రాజేశ్కు అనుకూలంగా ఎమ్మెల్యే వేముల వీరేశం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 07వ వార్డును దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుదల, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులను ప్రాధాన్యతతో చేపడతామని తెలిపారు.వార్డు అభివృద్ధి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్న ఆయన, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ సహాయం ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్య ఉంటుందని, వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజాప్రతినిధిగా తనదేనని ధైర్యం చెప్పారు.చిట్యాల పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో చిట్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి