విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!
విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!
K.RAVI
అంబేద్కర్ సాక్షిగా హక్కుల పోరాటం..
‘రెగ్యులర్’ రూల్స్ వర్తింపజేయాలి.
సొసైటీ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాల్సిందే..
చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ డిమాండ్
విద్యుత్ వెలుగుల వెనుక ఉన్న తమ జీవితాల్లో చీకట్లు ముసిరిపోతున్నాయని, ఇకనైనా న్యాయం చేయాలని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు తమ నిరసన గళాన్ని వినిపించారు.ఎన్నో ఏళ్లుగా శాఖలో సేవలందిస్తున్నా యాజమాన్యం కనికరించకపోవడంతో సమ్మె బాట పట్టక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించి, తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి సౌకర్యాలు కల్పించాలని వారు వినతి పత్రం ద్వారా కోరారు. తమ న్యాయమైన పోరాటానికి అంబేద్కర్ ఆశీస్సులు ఉంటాయని కార్మిక నాయకులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి