విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్
విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు లో విద్యా ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వార్డ్ కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ స్వీట్స్ పంపిణీ చేసి వారి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ, వారి ఉన్నత చదువుల కోసం అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యే వ్యక్తి అభివృద్ధికి బాటవేస్తుందని, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అవురెండి సుందర్, ఎర్పుల నరేష్, కుక్కల వీరేష్, చిత్రగంటి నవీన్, పాల అభిషేక్, అఖిల్, ఓంకార్, సిద్దు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి