Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:45 PM

విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం: మంత్రి సవిత

విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం: మంత్రి సవిత

విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం: మంత్రి సవిత
May 18, 2026 01:43 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సవిత పేర్కొన్నారు. లలిత కళ పరిషత్ లో కురుబ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కురుబ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.


విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించిన మంత్రి, ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ వంటి ఉన్నత లక్ష్యాలను సాధించే సామర్థ్యం ప్రతి విద్యార్థిలో ఉందన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి విద్యపై దృష్టి సారించాలని, తల్లిదండ్రులు పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు.


ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ విద్య వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే “తల్లికి వందనం”, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు.


అనంతరం SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 950కు పైగా మార్కులు సాధించిన 12 మంది ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున, పదో తరగతిలో 580కు పైగా మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. అదేవిధంగా 508 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ప్రోత్సాహకాలు అందించారు. కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News