PRINT TIME: May 03, 2026 09:11 PM
ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ
ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ
May 03, 2026 07:17 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
రోజు రోజు కు పట్టణంలో పెరుగుతున్న ఎండ వేడి నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు జనని స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకొచ్చింది.సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని పలుచోట్ల ప్రజలకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ మైదం భాస్కర్ మాట్లాడుతూ...ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.సభ్యుల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలు తృప్తిని ఇస్తున్నాయని,భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పేరపు ఆనంద్,కన్వీనర్ కమలాకర్ కుంతావత్,ఆలేటి శ్రీకాంత్,పడకంటి చంద్రశేఖర్,మైదం బాను,జూకంటి సిద్దులు,మద్దూరి శ్రీకాంత్,ఉల్లోజు సురేష్ చారి,జూకంటి క్రిష్ణ,మైదం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి