ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
Sthanikam District Staff Reporter
-కుంభం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కుంభం కీర్తి రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపిన కుంభం ఫౌండేషన్ అధినేత కుంభం కీర్తి రెడ్డి ఈ సందర్భంగా జాబ్ మేళా నిర్వహించే ప్రదేశాన్నికుంభం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కీర్తి రెడ్డి పరిశీలించి, స్థానిక నాయకులతో మాట్లాడి, వారితో కలిసి జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల మే 8,9,10 తేదీలలో మూడు రోజుల పాటు ఐక్యరాజ్య సమితి అక్రిడేటెడ్ సంస్థ 1M1B సహకారంతో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 3500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.ఇప్పటికే 500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి దాదాపు 35 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొననున్నట్లు ఆమె పేర్కొన్నారు. భువనగిరి పట్టణ శివారులోని న్యూ డైమెన్షన్స్ స్కూల్లో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాను యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో వివిధ కంపెనీలతో కలిసి స్థానిక కళాశాలల విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి