Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:19 PM

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు
01-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


అంగరంగ వైభవంగా ఐదు రోజుల పండగ

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఈ నెల ముప్పైవ తేదీన ప్రారంభమైన దోమకొండ ఊర పండగ మూడో రోజుకు చేరుకుని భక్తుల జనజాతరతో కిటకిటలాడుతోంది. ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఊర పండగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.దోమకొండ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పండగకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. గ్రామంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన దోమకొండ బురుజు కోటతో పాటు ఊరడమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, అగ్రహారం పోచమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ, కట్ట మైసమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీతో సందడి నెలకొంది.ఊర పండగ నిర్వహణకు ఆలయాల వద్ద, బురుజు ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు. స్థానిక బురుజు కోట వద్ద రంగసానితో రంగమెక్కించి భవిష్యవాణి వినిపించడం భక్తులను ఆకట్టుకుంది. గ్రామ పొలిమేరలో సరుగుచల్లి, అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నాటి నృత్యాలతో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కనులవిందుగా సాగాయి. ఊర పండగ జాతరను తలపిస్తూ దోమకొండ గ్రామం మొత్తం భక్తిభావంతో మునిగిపోయింది.ఫిబ్రవరి రెండో తేదీన ఊరడమ్మకు చేయడం, మూడో తేదీన కట్ట మైసమ్మకు చేయడం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య, దోమకొండ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు

Article Image


అంగరంగ వైభవంగా ఐదు రోజుల పండగ

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఈ నెల ముప్పైవ తేదీన ప్రారంభమైన దోమకొండ ఊర పండగ మూడో రోజుకు చేరుకుని భక్తుల జనజాతరతో కిటకిటలాడుతోంది. ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఊర పండగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.దోమకొండ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పండగకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. గ్రామంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన దోమకొండ బురుజు కోటతో పాటు ఊరడమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, అగ్రహారం పోచమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ, కట్ట మైసమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీతో సందడి నెలకొంది.ఊర పండగ నిర్వహణకు ఆలయాల వద్ద, బురుజు ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు. స్థానిక బురుజు కోట వద్ద రంగసానితో రంగమెక్కించి భవిష్యవాణి వినిపించడం భక్తులను ఆకట్టుకుంది. గ్రామ పొలిమేరలో సరుగుచల్లి, అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నాటి నృత్యాలతో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కనులవిందుగా సాగాయి. ఊర పండగ జాతరను తలపిస్తూ దోమకొండ గ్రామం మొత్తం భక్తిభావంతో మునిగిపోయింది.ఫిబ్రవరి రెండో తేదీన ఊరడమ్మకు చేయడం, మూడో తేదీన కట్ట మైసమ్మకు చేయడం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య, దోమకొండ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News