Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:46 PM

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు
February 01, 2026 03:05 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


అంగరంగ వైభవంగా ఐదు రోజుల పండగ

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఈ నెల ముప్పైవ తేదీన ప్రారంభమైన దోమకొండ ఊర పండగ మూడో రోజుకు చేరుకుని భక్తుల జనజాతరతో కిటకిటలాడుతోంది. ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఊర పండగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.దోమకొండ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పండగకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. గ్రామంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన దోమకొండ బురుజు కోటతో పాటు ఊరడమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, అగ్రహారం పోచమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ, కట్ట మైసమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీతో సందడి నెలకొంది.ఊర పండగ నిర్వహణకు ఆలయాల వద్ద, బురుజు ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు. స్థానిక బురుజు కోట వద్ద రంగసానితో రంగమెక్కించి భవిష్యవాణి వినిపించడం భక్తులను ఆకట్టుకుంది. గ్రామ పొలిమేరలో సరుగుచల్లి, అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నాటి నృత్యాలతో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కనులవిందుగా సాగాయి. ఊర పండగ జాతరను తలపిస్తూ దోమకొండ గ్రామం మొత్తం భక్తిభావంతో మునిగిపోయింది.ఫిబ్రవరి రెండో తేదీన ఊరడమ్మకు చేయడం, మూడో తేదీన కట్ట మైసమ్మకు చేయడం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య, దోమకొండ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News