Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:50 PM

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు
February 01, 2026 03:05 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


అంగరంగ వైభవంగా ఐదు రోజుల పండగ

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఈ నెల ముప్పైవ తేదీన ప్రారంభమైన దోమకొండ ఊర పండగ మూడో రోజుకు చేరుకుని భక్తుల జనజాతరతో కిటకిటలాడుతోంది. ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఊర పండగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.దోమకొండ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పండగకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. గ్రామంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన దోమకొండ బురుజు కోటతో పాటు ఊరడమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, అగ్రహారం పోచమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ, కట్ట మైసమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీతో సందడి నెలకొంది.ఊర పండగ నిర్వహణకు ఆలయాల వద్ద, బురుజు ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు. స్థానిక బురుజు కోట వద్ద రంగసానితో రంగమెక్కించి భవిష్యవాణి వినిపించడం భక్తులను ఆకట్టుకుంది. గ్రామ పొలిమేరలో సరుగుచల్లి, అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నాటి నృత్యాలతో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కనులవిందుగా సాగాయి. ఊర పండగ జాతరను తలపిస్తూ దోమకొండ గ్రామం మొత్తం భక్తిభావంతో మునిగిపోయింది.ఫిబ్రవరి రెండో తేదీన ఊరడమ్మకు చేయడం, మూడో తేదీన కట్ట మైసమ్మకు చేయడం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య, దోమకొండ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News